News April 12, 2025

రాజమండ్రి: ఇంటర్ స్టేట్ టాపర్లను అభినందించిన మంత్రి దుర్గేష్

image

ఇంటర్ ఫలితాలలో స్టేట్ టాప్ ర్యాంక్ లను సాధించిన విజేతలను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. రాజమండ్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో తన అంధత్వాన్ని ఎదురించి హెచ్ఇసీ సోషల్ స్టడీస్ లో 955 /1000 మార్కులు సాధించిన షేక్ ఫర్జానాను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక అల్కాట్ గార్డెన్స్ లో ఇంటర్ విద్యార్థులను అభినందించారు

Similar News

News January 18, 2026

తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

image

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.

News January 18, 2026

వేగం కన్నా ప్రాణం మిన్న.. వాహనదారులకు ఎస్పీ హితవు

image

సంక్రాంతి ముగించుకుని గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు రహదారి నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. రోడ్లపై రద్దీ దృష్ట్యా వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యమని హితవు పలికారు. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు మానుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు నివారించాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.

News January 17, 2026

ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

రాజమండ్రి ఏపీ ఎన్జీవో హోమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఎన్జీవో సంఘ ప్రతినిధులు కలెక్టరేట్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.