News November 19, 2025
రాజమౌళి-మహేశ్బాబు ‘వారణాసి’పై వివాదం!

రాజమౌళి-మహేశ్బాబు ‘వారణాసి’ సినిమాపై వివాదం మొదలైంది. సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ ఇదే టైటిల్ను రెండేళ్ల క్రితం TFPCలో రిజిస్టర్ చేయించారు. ఆ టైటిల్ను SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన TFPCలో ఫిర్యాదు చేశారు. అయితే రాజమౌళి తెలుగు మినహా ఇతర భాషల్లో ఈ టైటిల్ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే గ్లింప్స్లోనూ మూవీ టైటిల్ను తెలుగులో ఇవ్వలేదని సమాచారం. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.
Similar News
News January 16, 2026
HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.
News January 16, 2026
HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.
News January 16, 2026
బంపరాఫర్.. లేఖ రాస్తే రూ.50వేలు, స్విట్జర్లాండ్ పర్యటన!

విద్యార్థులకు CBSE రైటింగ్ కాంపిటేషన్ ప్రకటించింది. డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో వివరిస్తూ స్నేహితుడికి లేఖ రాయాలని తెలిపింది. 9-15 ఏళ్ల విద్యార్థులను అర్హులుగా పేర్కొంటూ మార్చి 20లోపు స్కూళ్లు రిపోర్టులు సమర్పిస్తే విజేతలను ఎంపిక చేస్తామంది. విజేతలకు సర్కిల్, జాతీయ స్థాయిలో రూ.5-50వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జాతీయ స్థాయిలో విజేతకు స్విట్జర్లాండ్ పర్యటనకు ఛాన్స్ ఇస్తామంది.


