News February 7, 2025

రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 16, 2026

గాలిలో బిల్‌గేట్స్ విమానం చక్కర్లు!

image

AP: బిల్‌గేట్స్ విమానం ల్యాండింగ్‌కు సమస్య తలెత్తింది. విజయవాడ విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ల్యాండింగ్ సాధ్యపడట్లేదు. దీంతో ఫ్లైట్ విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది. సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం కోసం పైలట్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బిల్‌గేట్స్ అమరావతిని సందర్శించాల్సి ఉంది.

News February 16, 2026

కాకినాడ: మూడేళ్ల క్రితం తండ్రి మృతి.. ఇప్పుడు కూతురు సూసైడ్!

image

కాకినాడ JNTU హాస్టల్‌లో టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152593>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.

News February 16, 2026

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం నుంచి రూ.564 కోట్లు!

image

TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బకాయిల విడుదలకు కేంద్రం ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ అధికారులు ఢిల్లీ వెళ్లగా రూ.564 కోట్ల రిలీజ్‌కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా 60వేల పంపిణీ పూర్తయింది. మరో 30వేలు పంపిణీకి సిద్ధమవ్వగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నిధులు ఇస్తే నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముంది.