News March 26, 2024
రాజుపాలెం: గడ్డివామి దగ్ధం.. రూ.లక్ష నష్టం

రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 16, 2026
కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 16, 2026
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.
News February 16, 2026
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి కలెక్టర్ సభా భవనంలో కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. కడపతో పాటు అన్ని మున్సిపల్, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా అర్జీలు స్వీకరిస్తారని ఆయన స్పష్టం చేశారు.


