News April 12, 2024

రాములోరి కళ్యాణానికి జానకీ సదనం సిద్ధం..!

image

భద్రాచలంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం సౌమిత్రీ సదనం సమీపంలో రూ.3.6 కోట్లతో గ్రౌండ్‌ ప్లస్‌ 2పద్ధతిలో 34 గదులను నిర్మించారు. దీనికి జానకీ సదనం అని పేరు నిర్ణయించారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉండగా వీలైనంత తొందరగా పూర్తిచేసి 17న ప్రారంభించాలని సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సత్రాలకు తోడు ఇది అందుబాటులోకి వస్తే భక్తులకు వసతి సదుపాయం మెరుగుపడనుంది.

Similar News

News December 12, 2025

KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

image

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.

News December 12, 2025

ఖమ్మం జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

ఖమ్మం జిల్లాలో 192 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 90.08 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

H.I.V వ్యాక్సిన్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: హెచ్.పి.వి. వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం జడ్పి కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.