News March 3, 2025
రావిర్యాలలో ఏటీఎంను చోరీ.. మూడు బృందాలతో గాలింపు

రావిర్యాలలో SBI <<15626678>>ఏటీఎంను చోరీ<<>> ఘటనపై పోలీసులు 3 బృందాలతో గాలిస్తున్నారు. హరియాణా దొంగలుగా భావిస్తున్న పోలీసులు.. ముంబైవైపు వారు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. 2019లోనూ ఇదే తరహాలో ఆదిభట్లలో ఏటీఎం చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక అలారం మోగకుండా కేబుళ్లను తెంపేసి, సీసీ కెమెరాలపై నల్లటి స్ప్రేను చల్లి ఏటీఎం ధ్వంసం చేసి రూ.29.70 లక్షల నగదును దోచుకెళ్లారు.
Similar News
News March 25, 2025
మేడ్చల్: బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 25, 2025
BRS సభ వేదిక ఘట్కేసర్కి మార్పు!

BRS రజతోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ వేదికను మార్పు చేస్తున్నట్లు సమాచారం. వేసవి తీవ్రత సందర్భంగా పార్కింగ్ సదుపాయాలు అన్ని జిల్లాల నుంచి రవాణా సదుపాయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం, తాజా సభ కోసం HYD శివారు ఘట్కేసర్ వద్ద ప్రముఖ ప్రైవేట్ స్కూల్ వెనక ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు సమాచారం, ఉంది. ఉంది…!
News March 25, 2025
MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.