News November 19, 2025
రాష్ట్రంలోనే ఏలూరు ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్కు అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. పథకం సమాచారం కోసం 1912కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.
Similar News
News January 17, 2026
నేడు బంగ్లాతో భారత్ ఢీ

U-19 వన్డే WCలో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్లో విఫలమైన 14ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. అతనికి తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జి, కుందు రాణిస్తే IND గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. అటు తొలి మ్యాచ్లో 5 వికెట్లతో సత్తా చాటిన హెనిల్ పటేల్ను నిలువరించడం బంగ్లాకు కష్టమే. జింబాబ్వేలోని బులవాయో వేదికగా మ్యాచ్ 1pmకు మొదలుకానుంది.
News January 17, 2026
NRPT: మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల

నారాయణపేట పురపాలక సంఘ పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు నేపథ్యంలో తుది ఫొటో ఓటర్ల జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను మొత్తం 56 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈ జాబితాలను ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు.
News January 17, 2026
కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.


