News November 19, 2025
రాష్ట్రంలోనే ఏలూరు ప్రథమ స్థానం: సాల్మన్ రాజ్

ఏలూరు జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకు 1,00,026 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 31,022 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను గ్రిడ్కు అనుసంధానించినట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సాల్మన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో 4,218 మంది వినియోగదారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. పథకం సమాచారం కోసం 1912కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.
Similar News
News January 13, 2026
సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోండి: తిరుపతి DEO

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోపు సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలని తిరుపతి DEO KVN కుమార్ సూచించారు. త్వరలోనే అర్హులైన వారి జాబితా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వస్తుందన్నారు. అర్హుల జాబితాను https://www.bse.ap.gov.in వెబ్సైట్లో పెడతారని చెప్పారు. HMలు, తల్లిదండ్రులు ఈ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
News January 13, 2026
Photo Gallery: సంక్రాంతి సంబరాల్లో సీఎం

AP: తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో CM చంద్రబాబు పాల్గొని వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, బాలయ్య మనవళ్లు కూడా పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి గిఫ్ట్స్ అందజేశారు.
News January 13, 2026
కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా..! రెవెన్యూ డివిజన్..?

విభజనపై జిల్లా వాసుల్లో, రాజకీయ నేతల్లో కలకలం మొదలైంది. జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రాగా అధికారికంగా ప్రకటన చేయలేదు. కొడంగల్ విషయంలో ఏదైనా కొత్త నిర్ణయం జరగవచ్చని చెబుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కొంతకాలంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా లేదా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చసాగుతోంది.


