News November 30, 2025
రాష్ట్రస్థాయిలో మెరిసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు

మెదక్ జిల్లాలో ఈ నెల 28 నుంచి ఆదివారం వరకు జరిగిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర, బాలికల జట్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖోఖో సంఘం సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.
Similar News
News February 13, 2026
జమ్మికుంటలో దిగ్గజాలు కనుమరుగు.. కొత్త వారికి పట్టం!

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు వినూత్న తీర్పు ఇచ్చారు. రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలను పక్కనపెట్టి, ఉత్సాహవంతులైన కొత్త అభ్యర్థులను గెలిపించారు. ముఖ్యంగా గతంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవుల్లో పనిచేసి, పట్టణంపై పట్టున్న నాయకులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం గమనార్హం.
News February 13, 2026
BREAKING: మోత్కూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే

యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 ఇండిపెండెంట్ గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
PMO ఇకపై సేవా తీర్థ్.. ప్రారంభించిన మోదీ

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ కాంప్లెక్స్ను PM మోదీ ప్రారంభించారు. దీంట్లో PMOతో పాటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్కు సంబంధించిన ఆఫీసులుంటాయి. ఇక నుంచి PMOను సేవా తీర్థ్గా పిలుస్తారు. సెంట్రల్ సెక్రటేరియట్కు కర్తవ్య భవన్గా నామకరణం చేశారు. గతంలో ఇవన్నీ సెంట్రల్ విస్టా పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఉండేవి. దీనివల్ల పరిపాలనాపరమైన ఆలస్యం చోటు చేసుకునేది.


