News September 10, 2025
రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్కు ఘన స్వాగతం

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై సమీక్షించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
Similar News
News December 13, 2025
MBNR: రెండో విడత.. ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

MBNR జిల్లాలోని 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 151 గ్రామాలు, 255 పోలింగ్ కేంద్రాలు, 1334 పోలింగ్ స్టేషన్లు, 36 సమస్యాత్మక గ్రామాలలో 42 లొకేషన్లు 355 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎస్పీ డి.జానకి అన్నారు. రూట్ మొబైల్స్-49, FST-16, స్ట్రైకింగ్ ఫోర్సులు-5, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు- 5 ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేశామన్నారు.
News December 13, 2025
MBNR: 2వ విడత ఎన్నికలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

రెండో విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 1,249 మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ-1, అదనపు ఎస్పీలు-2, డిఎస్పీలు-7, ఇన్స్పెక్టర్లు-29, సబ్ ఇన్స్పెక్టర్లు-66, మిగతా సిబ్బంది-1,134 మంది పోలీస్ సిబ్బంది జిల్లాలోని హన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలలో విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2025
పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

మహబూబ్నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.


