News December 1, 2025
రెండో విడత నామినేషన్ల ఘట్టం రేపటితో పూర్తి: కలెక్టర్ తేజస్

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. 8 మండలాల పరిధిలోని 181 సర్పంచ్, 1,628 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నామని ఆయన చెప్పారు. అభ్యర్థులు గడువులోగా తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలు నామినేషన్ కేంద్రాలను సందర్శించారు.
Similar News
News February 14, 2026
నెల్లూరు: రైలు కిందపడి ఒకరి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్లో తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి మూడో నెంబర్కు వెళుతుండగా అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-45 ఏళ్లు ఉంటుంది. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు.
News February 14, 2026
విశాఖ: కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దు

విశాఖలో 17 నుంచి 25 వరకు అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ ఐఎఫ్ఆర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య నేతలు రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్ల నిర్వహణలో పాల్గొంటున్నారన్నారు. ఈ మేరకు నగర ప్రజలు గమనించాలని సూచించారు.
News February 14, 2026
OFFICIAL: నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్

TG: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. అక్కడి 60 డివిజన్లలో బీజేపీ 28, కాంగ్రెస్-17, MIM-14 స్థానాలు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. మేయర్ పీఠం అధిష్ఠించడానికి (మ్యాజిక్ ఫిగర్ 31) బీజేపీ 3 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, MIM కలిస్తే మేయర్ పీఠం వారి సొంతమవుతుంది. అటు కొత్తగూడెం, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.


