News August 28, 2024

రేపు కడప జిల్లాకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం ఎర్రగుంట్ల మండలం కలమలకు రానున్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని కలమలలో ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రేపు ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంటకు చేరుకొని, అక్కడి నుంచి రైలులో 11.35కు ఎర్రగుంట్లకు వస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కలమలకు చేరుకుంటారు.

Similar News

News January 17, 2026

కడప టు ఢిల్లీ

image

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవి ఎంపికయ్యారు. లలిత కళలకు నిలయమైన కడపకు అరుదైన గౌరవాన్ని మూలి పల్లవి తీసుకొచ్చారు. భారత సాంస్కృతిక శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి భారత అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, సంగీత నాటక అకాడమీ కేంద్రాలలో ప్రత్యేక రిహార్సల్ పొందుతున్నారు. ఏపీ నుంచి కూచిపూడి నృత్యానికి సంబంధించి 30 మందిని ఎంపికచేసింది.

News January 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810

News January 17, 2026

కడప: నదిలో మృతదేహం కలకలం

image

కడప జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతదేహం నంద్యాల జిల్లాలోని కుందూ నదిలో లభ్యమైంది. శూలం లక్ష్మీదేవి తరచుగా కోయిలకుంట్ల(M) కలుగొట్ల కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు, సంజామల(M) వసంతాపురం గ్రామానికి వచ్చేదని ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.