News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News January 15, 2026

తిరుపతి: భయపెడుతున్న టిప్పర్లు

image

తిరుపతి జిల్లా నుంచి తమిళనాడుకు భారీగా గ్రావెల్, ఇసుక, కంకర తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం మీదుగా రోజుకు 250 నుంచి 300 వరకు టిప్పర్లు బార్డర్ దాటుతున్నాయి. కొన్ని అనుమతులు లేకుండా, మరికొన్ని నకిలీ బిల్లులతో తరలిస్తున్నారని సమాచారం. పుత్తూరు-చెన్నై మెయిన్ రోడ్డుపై రాత్రి వేళ టిప్పర్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణాలంటేనే అందరూ హడలిపోతున్నారు.

News January 15, 2026

పతంగుల జోరు.. యమపాశం కావొద్దు: సజ్జనార్

image

TG: సంక్రాంతికి పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ అని, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోందని HYD CP సజ్జనార్ అన్నారు. ‘చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలను అమ్మినా, కొన్నా, వాడినా చట్టం ఊరుకోదు. బైకర్ల మెడకు మాంజా చుట్టుకొని గొంతు తెగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నం. మీ సరదా అమాయకుల ప్రాణాలను బలిగొనకూడదు’ అని ట్వీట్ చేశారు.

News January 15, 2026

ఇవి తీసుకుంటే PCODకి చెక్

image

ఈ మధ్య కాలంలో మహిళలను PCOD ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడం, పీరియడ్స్ అస్తవ్యస్తంగా మారతాయని నిపుణులు. అయితే ఇది తగ్గాలంటే ఆహారంలో దాల్చిన చెక్క పొడి, పుదీనా టీ, ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యాయామం చేయడం, మంచి డైట్ తీసుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.