News November 30, 2025

రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

image

ములుగు జిల్లాలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Similar News

News February 17, 2026

పాఠశాలల్లో పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

image

పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలోపు గ్రౌండ్ లెవలింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీపీవో రవీందర్, డీసీహెచ్‌వో శ్రీధర్, పీఎం షేక్ పాల్గొన్నారు.

News February 17, 2026

జహీరాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా యూనుస్

image

జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ యూనుస్ ఛైర్మన్‌గా, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తకాపు శిరీష రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఐఎం, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించింది. ఆర్డీవో దేవుజా సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

News February 17, 2026

సల్మాన్ తండ్రి సలీమ్‌కు అస్వస్థత

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ (90) అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని లీలావతీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సహా కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాగా సలీమ్ ఖాన్ ఎన్నో హిట్ చిత్రాలకు కథ, మాటలు రాశారు. మరో బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్‌తో కలిసి షోలే, దీవార్, జంజీర్, త్రిశూల్, డాన్ వంటి బ్లాక్‌బస్టర్లు అందించారు.