News March 27, 2024
రేపు విశాఖకు చెన్నై సూపర్ కింగ్స్ టీం..!

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.
Similar News
News February 17, 2026
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనకు MP శ్రీ భరత్, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నగరంలోకి వెళ్లారు.
News February 17, 2026
72 గంటల పాటు బీచ్ రోడ్డులో డ్రోన్ కెమెరాల నిషేధం

విశాఖ IFR, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ అఫ్ చీఫ్స్ నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి డ్రోన్ కెమెరాలు ఉన్న వారికి పలు సూచనలు చేశారు.17వ తేదీ సాయంత్రం 6 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ 72 గంటలు INS డేగా నుంచి పార్క్ హోటల్ వరకూ 5 కిలోమీటర్లు టెంపరరీ రెడ్ జోన్గా ప్రకటించారు. 5 కిలోమీటర్లు పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎట్టి పరిస్థితులలోనూ వినోయోగించరాదన్నారు. వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News February 17, 2026
గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు షాక్: వైసీపీ

4 వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం వర్సిటీని సుప్రీంకోర్టు ఆదేశించిందని వైసీపీ ట్వీట్ చేసింది. వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం రూ.118 కోట్ల బకాయిలు చెల్లించాలని.. లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసిందని అందులో పేర్కొంది. తమను ఈ బకాయిలు చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం బుకాయించినా.. వీబీసీ, గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదించిందంది.


