News April 27, 2024
రేపు వెంకటగిరికి ముఖ్యమంత్రి రాక

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంకటగిరికి రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్రిభువని కూడలి ప్రాంతంలో సభ నిర్వహణకు అవసరమైన ప్రాంతాలను స్థానిక నాయకులు పరిశీలించారు.
Similar News
News April 18, 2026
నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
News April 18, 2026
నెల్లూరు: బాలికపై రేప్.. పదేళ్లు జైలు శిక్ష

నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య(45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె(16)ని 2021లో బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
News April 18, 2026
ఏపీ జట్టు కెప్టెన్గా ముత్తుకూరు యువకుడు

మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు జరిగే జాతీయ స్థాయి టీ-10 క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్గా నెల్లూరు జిల్లా ముత్తుకూరు యువకుడు బాపనపాటి ప్రకాశ్ ఎంపికయ్యాడు. కరీముల్లా, సునీల్, వెంకటేశ్, నాగేంద్ర, అఖిల్ తదితరులు జట్టు సభ్యులుగా అసోసియేషన్ ప్రకటించింది. స్థానిక క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


