News October 6, 2025
రేవల్లిలో కలకలం.. అత్తను చంపిన కోడలు

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో అమానుషం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలు బోగురమ్మ తన వృద్ధురాలైన అత్త దొడ్డిపట్ల ఎల్లమ్మ (70)ను కొట్టి చంపింది. అనంతరం దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. ఆదివారం దహన సంస్కారాలు చేస్తుండగా మృతదేహం వద్ద దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఎస్ఐ రజిత తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.
Similar News
News January 18, 2026
20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. FEB 12న పోలింగ్?

TG: జనవరి 20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12న పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 2027 గోదావరి పుష్కరాలతో పాటు రైతుభరోసాపై మంత్రులు చర్చిస్తున్నారు.
News January 18, 2026
టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.
News January 18, 2026
పొంగులేటి నివాసంలో సీఎం విందు.. అదిరిందన్న రేవంత్!

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మంత్రి ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలతో కూడిన విందును సీఎం ఆస్వాదించారు. “భోజనం అదిరింది” అంటూ మంత్రి కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం పొంగులేటి దంపతులు సీఎంను శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్ను జ్ఞాపికగా బహూకరించారు.


