News September 12, 2025

రేవులపల్లి-నందిమల్ల మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలి..!

image

ధరూర్ మండలం రేవులపల్లి, నందిమల్ల మధ్య జూరాల ప్రాజెక్ట్ దిగువన హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ కోరింది. బుధవారం కమిటీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. రేవులపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించినప్పటికీ.. ఇటీవల కొత్తపల్లి-జూరాల మధ్య నిర్మించే యత్నం చేస్తున్నారని దానిని విరమించుకోవాలన్నారు.

Similar News

News December 13, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*విశాఖలో 9 IT సంస్థలకు CM చంద్రబాబు, లోకేశ్ శంకుస్థాపన
*ఉత్తరాంధ్రలోని పలు ప్రాజెక్టుల పురోగతిపై CM CBN ఏరియల్ సర్వే
*మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం రాకండి: మంత్రి కోమటిరెడ్డి
*ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. సిగ్గుండాలి: కవిత
*మూడ్రోజుల్లో రూ.3,760 పెరిగిన బంగారం
*ఉపాధి హామీ పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్పు
*ఎప్‌స్టీన్ ఫైల్స్.. ట్రంప్, క్లింటన్, బిల్‌గేట్స్ ఫొటోలు

News December 13, 2025

అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

image

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.

News December 13, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✓నేటితో ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓రేపు సారపాక, పినపాక ప్రాంతాల్లో పవర్ కట్
✓సుజాతనగర్ PHCని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓పాల్వంచ పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
✓బూర్గంపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✓భద్రాచలం: ముక్కోటి గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
✓మణుగూరు: అడవిలో చెట్ల నరికివేత హైకోర్టు బ్రేక్
✓రేపు నవోదయ ప్రవేశ పరీక్ష… జిల్లాలో 8 కేంద్రాలు