News November 19, 2025
రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
TU: మొదటి రోజు పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో B.Ed, B.P.Ed,LLB,LLM 1,3 సెమిస్టర్ల, PG ఇంటిగ్రేటెడ్(APE/PCH), IMBA 3,5 రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జరిగిన B.Ed, B.P.Ed పరీక్షలకు 2,798 విద్యార్థులకు 2,721 మంది హాజరు కాగా, ఇంటిగ్రేటెడ్(APE/PCH),IMBA పరీక్షలకు 230 కి 217 మంది హాజరయ్యారన్నారు. 90 మంది గైర్హాజరయ్యారు.
News January 22, 2026
యాదాద్రి: ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి రద్దు: కలెక్టర్

ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News January 22, 2026
ఖమ్మం: ఆ ఇంట్లో అల్లుడే దొంగ..!

అత్తవారి ఇల్లు అల్లుడికి అడ్డా అనుకున్నాడో ఏమో గానీ, ఏకంగా నగలే ఊడ్చేశాడు. కారేపల్లి మండలానికి చెందిన రాంబాబు మద్యానికి బానిసై, డబ్బుల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తన అత్త కలమ్మ ఇంట్లోనే ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మేందుకు వెళ్తుండగా KMM సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. అల్లుడే దొంగ అని తేలడంతో బాధితురాలు విస్మయం వ్యక్తం చేసింది.


