News December 1, 2025

రైతు సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా: ఏలూరు ఎంపీ

image

పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు విషయాలను ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ప్రధానంగా రైతుల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి, అలాగే ఇటీవల ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.

Similar News

News February 13, 2026

కొల్లాపూర్: పట్టు నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి

image

కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి పట్టు నిలబెట్టుకున్నారు. మొత్తం 19 వార్డులకు గాను 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం మూడు స్థానాలలో మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు.

News February 13, 2026

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పనులు వేగవంతం

image

అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మార్చి 16న శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు 24 గంటలూ పనులు చేస్తున్నారు. సుందరీకరణ పనులకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతానికి విగ్రహావిష్కరణ మాత్రమే మార్చి 16న జరుగుతుందని సమాచారం. మిగిలిన పనులు తర్వాత పూర్తి కానున్నాయి.

News February 13, 2026

మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ: కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓట్లు..!

image

అలంపూర్ పురపాలక ఎన్నికల సమరం ముగిసింది, కానీ అసలు సిసలైన రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడి, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఛైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న ఎక్స్-అఫీషియో ఓట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులు ఉన్నాయి.