News August 20, 2025

రైతు సమస్యలపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

image

పంట బీమా చెల్లింపుల్లో ఆలస్యం, రైతుల సమస్యలపై ఎంపీ కడియం కావ్య పార్లమెంటులో ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న తరుణంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి కృషి చేయాలని ఎంపీ అన్నారు.

Similar News

News January 18, 2026

బల్కంపేట్ ఎల్లమ్మకి మౌని అమావాస్య ప్రత్యేక పూజలు

image

మౌని అమావాస్య సందర్భంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.

News January 18, 2026

సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

image

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.

News January 18, 2026

అలంపూర్: దక్షిణ కాశీలో బ్రహ్మోత్సవ సంబరం

image

అలంపూర్ క్షేత్రంలో కొలువై ఉన్న శక్తిపీఠం శ్రీ జోగుళాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో దీప్తి రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. ఈనెల 19 (సోమవారం) నుంచి 23 (శుక్రవారం) వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృప పొందాలన్నారు.