News December 2, 2025
రొయ్యల చెరువు అడుగు పాడైనట్లు ఎలా గుర్తించాలి?

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.
Similar News
News February 16, 2026
జామలో గజ్జి తెగులును ఎలా నివారించాలి?

జామ పంటలో గజ్జి తెగులు ప్రధానంగా పచ్చి కాయలపై కనిపిస్తుంది. దీని వల్ల కాయలపై చిన్నచిన్న తుప్పు రంగు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగా పెరగకుండా రాలిపోతాయి. దీని వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగులును నివారించడానికి లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 4 గ్రాముల కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 16, 2026
మహిళలు హనుమంతుడి పాదాలు తాకకూడదా?

‘హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆయన బ్రహ్మచర్య నియమాలను గౌరవించాలనే ఉద్దేశ్యంతో మహిళలు స్వామివారి పాదాలను తాకకూడదు’ అని పండితులు సూచిస్తున్నారు. భక్తికి లింగభేదం లేదని చెబుతున్నారు. ‘మహిళలు హనుమాన్ చాలీసా పఠించవచ్చు. కఠిన ఉపవాసాలు ఉండవచ్చు. సీతాదేవిని తల్లిగా గౌరవించిన హనుమంతుని పట్ల మహిళలు చూపించే నిష్కల్మషమైన భక్తి, మానసిక ఆరాధన అత్యంత పుణ్యప్రద ఫలితాలను ఇస్తాయి’ అని చెబుతున్నారు.
News February 16, 2026
భైంసాలో బద్దలైన మజ్లిస్ కోట

TG: నిర్మల్ (D) భైంసా మున్సిపల్ ఛైర్మన్ పీఠం గత 20 ఏళ్లుగా MIM చేతుల్లోనే ఉండేది. తాజా ఎన్నికల్లో 26 వార్డులకు గాను MIM 12, BJP 6, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 7 చోట్ల గెలిచారు. మరోసారి MIM ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్రులకు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో ఇండిపెండెంట్లు దత్తాత్రి (బీజేపీ రెబల్), ఖతీజా బేగం (MIM రెబల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అయ్యారు.


