News October 3, 2024
రోజా గారూ.. అప్పుడు ఏమైంది: వాసంశెట్టి

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయగా.. దీనికి కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. ‘రోజా గారూ మీరు మంచి మనసుతో ఇలా స్పందించడం చాలా ఆనందం. కానీ ఆరోజు రాజకీయాలకు సంబంధంలేని లోకేశ్ తల్లి భువనేశ్వరిని నిండు సభలో YCP నేతలు అవమానించినప్పుడు పకపక నవ్వారు కదా అప్పుడు ఏమైంది మీ స్పందన?’ అని వాసంశెట్టి ట్వీట్ చేశారు.
Similar News
News December 14, 2025
చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.
News December 14, 2025
మిస్ ఆంధ్రాగా చిత్తూరు అమ్మాయి

అందాల పోటీల్లో చిత్తూరు జిల్లా అమ్మాయి మెరిసింది. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ దంపతులు బెంగళూరులో సెటిల్ అయ్యారు. వాళ్ల కుమార్తె జీవిరెడ్డి సహస్ర రెడ్డి(15) మోడల్గా రాణిస్తున్నారు. ఇటీవల విజయవాడలో APఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎన్విరాన్మెండ్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్నారు. టీనేజ్ విభాగంలో మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News December 13, 2025
చిత్తూరు: ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ ఫెస్ట్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు, అనంతరం 20న జిల్లాస్థాయి కెరీర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రంగాలు, విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.


