News February 5, 2025
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News April 11, 2026
టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి తిలక్కు పోలీసుల నోటీసులు

టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్పై శుక్రవారం టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలిలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేదం ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా గురువారం రాత్రి టెక్కలిలో వైసీపీ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేయడంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు విచారణకు శనివారం తిలక్ హాజరుకావాలని నోటీసులు అందించారు.
News April 11, 2026
టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి తిలక్కు పోలీసుల నోటీసులు

టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్పై శుక్రవారం టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలిలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలపై నిషేదం ఉన్నప్పటికీ పోలీసులు అనుమతి లేకుండా గురువారం రాత్రి టెక్కలిలో వైసీపీ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం వంటి కార్యక్రమాలు చేయడంపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు విచారణకు శనివారం తిలక్ హాజరుకావాలని నోటీసులు అందించారు.
News April 10, 2026
శ్రీకాకుళం: ఈ 8 మండలాల్లో రేపు తీవ్ర వడగాల్పులు

శ్రీకాకుళం జిల్లాలో శనివారం 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి , సారవకోట, ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, ఎల్. ఎన్.పేట, పాతపట్నం మండలాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


