News October 5, 2025

రోడ్డు ప్రమాదంలో విశాఖ దంపతులు మృతి

image

అనంతరపురం (D)లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన దంపతులు మృతి చెందారు. చిన్నముషిడివాడకు చెందిన రామ్ సుధీర్, లావణ్య దంపతులు అనంతపురంలో ఉంటున్నారు. వీరిద్దరూ తమ కుమారుడు ఆద్విక్‌తో కలిసి కారులో హంపీ వెళ్తుండగా.. ఎదరుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా లావణ్య, సుధీర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Similar News

News January 15, 2026

ఏలూరులో ఎండ్ల బండిపై ఎస్పీ దంపతుల సందడి

image

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

News January 15, 2026

TODAY HEADLINES

image

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్‌ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన

News January 15, 2026

WPL: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

image

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) చెలరేగి ఆడి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ, ఈ గెలుపుతో టోర్నీలో తన ఖాతాను తెరిచింది.