News September 9, 2025
లక్షెట్టిపేట: ముగ్గురు నిందితుల రిమాండ్

లక్షెట్టిపేట పట్టణంలోని సత్యసాయి నగర్కు చెందిన ఆవునూరి అక్షయ్ కుమార్, సంజయ్ కుమార్, విజయ్ను రిమాండ్కు తరలించామని ఎస్ఐ సురేశ్ ఈరోజు తెలిపారు. అక్షయ్ కుమార్ ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడంతో కేసును నమోదు చేశామన్నారు. రాజీ కావడం లేదని తండ్రి, కూతురిని నిందితులు చంపే ప్రయత్నం చేయగా బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ వివరించారు.
Similar News
News December 5, 2025
FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.
News December 5, 2025
కామారెడ్డి: మండలాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు

పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మండలాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఈ కేంద్రాలను అన్ని MPDO కార్యాలయాల్లో మూడు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ సక్రమ వినియోగానికి ప్రతి కేంద్రంలో ఇద్దరు గెజిటెడ్ అధికారులు, పర్యవేక్షణాధికారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 5, 2025
స్క్రబ్ టైపస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఎం

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో స్క్రాబ్ టైపస్ కేసులు నమోదు అవుతున్న కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీదేవి శుక్రవారం తెలిపారు. తలనొప్పి, జ్వరం, శరీరం మీద దద్దర్లు, కళ్లకలక వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే ప్రభుత్వ డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని తెలిపారు.


