News August 12, 2025
లక్ష్యసాధనలో కీలకంగా వ్యవహరించాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల లక్ష్యసాధనలో జిల్లాస్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆర్డీవోలు, మండల తహశీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 9, 2026
కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

T20WC ఫైనల్లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్తో పంచుకోగా ఈ టైమ్లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.
News March 9, 2026
సంగారెడ్డి: అక్టోబర్లో 101 ఏళ్ల బర్త్ డే.. మృతి

సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన శతాధిక వృద్ధురాలు గాదె పారమ్మ (101) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది అక్టోబర్లో ఆమె కుమారులు, మనమలు, ముని మనమలు కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ముగించి ఆమె మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కంగ్టి సర్పంచ్ కృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.
News March 9, 2026
కరీంనగర్: ఈనెల 12 వరకే ఛాన్స్..!

క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అద్భుత అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్ పాఠశాలలో మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులకు ఈనెల 12వ వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులు.


