News May 1, 2024

లవర్‌తో OYO వెళ్లిన జడ్చర్ల యువకుడి మృతి

image

OYO వెళ్లిన‌ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. SRనగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జడ్చర్ల వాసి హేమంత్(28) తన లవర్‌తో కలిసి సోమవారం HYD వచ్చాడు. ఓ ఫంక్షన్‌కు హాజరైన వీరు రాత్రి OYOలో బసచేశారు. మిడ్‌నైట్ తర్వాత బాత్రూంకి వెళ్లిన హేమంత్ ఎంతకీ రాకపోవడంతో అమ్మాయి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా పడి ఉన్నాడు. 108‌కి కాల్‌ చేయగా సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించి, చనిపోయినట్లు తెలిపారు. కేసు నమోదైంది

Similar News

News December 14, 2025

MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

మిడ్జిల్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మసి గుండ్లపల్లి సర్పంచ్‌గా శ్రీశైలం యాదవ్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మీద చెన్నయ్య 16ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. సందర్భంగా గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News December 14, 2025

MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్‌లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

News December 14, 2025

MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.