News January 11, 2025
వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం నుంచి నం.20833,84 వందేభారత్ రైళ్లు 20 కోచ్లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్లను 14 నుంచి 18కి పెంచామని, తద్వారా 1,128గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,440కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News January 22, 2025
దుర్గగుడి ప్రధానార్చకులు మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.
News January 22, 2025
జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్
ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.
News January 22, 2025
విజయవాడలో లారీ బీభత్సం.. వ్యక్తి మృతి
విజయవాడలో మంగళవారం అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహానాడు రోడ్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించగా ఓ వ్యక్తి మృతి చెందగా.. ఇరువురికి గాయాలయ్యాయి. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన జక్కుల గోపిగా పోలీసులు నిర్ధారించారు. గాయాలపాలైన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.