News June 18, 2024
వందే భారత్లో విజయవాడ బయలుదేరిన హోం మంత్రి

విశాఖ నుంచి వందే భారత్ రైలులో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్లారు. రైలులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రైన్లో కలిగి తిరుగుతూ అందరినీ పలకరించారు. హోం మంత్రినైనా ప్రజలతో కలిసిమెలిసి ఉండడమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ఎవరు ఏ సమస్య తన దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు.
Similar News
News January 17, 2026
కేజీహెచ్లో రోగులతో మాట్లాడిన కలెక్టర్

కేజీహెచ్లోని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వార్డులో పర్యటించారు. వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడగా రోగి సిబ్బందికి డబ్బులు ఇచ్చినట్లుగా చెప్పడంతో విచారణకు ఆదేశించారు. అక్కడే ఉన్న సూపర్డెంట్ ఈ విషయంపై విచారణ చేయాలని వైద్యం కోసం ఏ ఒక్కరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్నిచోట్ల ఉచితంగా వైద్య సేవలు అనే బోర్డులు పెట్టాలని సూచించారు
News January 17, 2026
KGHలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్

KGHలో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం KGHలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రీట్మెంట్కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూపరిండెంటెంట్ను ఆదేశించారు.
News January 17, 2026
KGHలో ఆన్లైన్ వైద్య సేవలు

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.


