News March 6, 2025
వజ్రకరూరు యువరైతు రికార్డు

వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామానికి చెందిన యువరైతు వంశీ అతి తక్కువ సమయంలో ఒక్కడే వేరుశనగ పంటను (చేతితో) తొలగించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి వేరుశనగ పంటను తొలగించడం మొదలుపెట్టి మధ్యాహ్నం 1గంట సమయానికి దాదాపు 1.25 ఎకరాలలో పంటను పీకేశారు. సాధారణంగా ఒక ఎకరం పంటను తొలగించడానికి దాదాపు 14 మంది కూలీల అవసరం. అలాంటిది వంశీ ఒక్కడే పంటను తొలగించడం విశేషం.
Similar News
News December 6, 2025
కుంభం ఇలాఖాలో BRS బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవం

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ఇలాఖాలో మొట్టమొదటగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భువనగిరి మండలం పీఎన్ తిమ్మాపురం సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ బలపరిచింది. కాంగ్రెస్, బీజేపీ తరఫున నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
News December 6, 2025
సల్కర్ పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో 12.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 13.3, మిడ్జిల్ మండలం దోనూరు 13.4, రాజాపూర్ 13.6, జడ్చర్ల 14.1, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, పారుపల్లి 14.7, భూత్పూర్ 14.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది.
News December 6, 2025
HYD: అడ్డూ అదుపు లేకుండా థియేటర్ల దోపిడీ.!

HYD మహానగరంలో సినిమా థియేటర్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. టికెట్ ధరతో సమానంగా.. కూల్ డ్రింక్స్, పాప్కాన్ పేరుతో దోచేస్తున్నారు. MRP ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. దీంతో సినిమాకు వచ్చేవారు జేబులు గుల్లవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారు. థియేటర్లకు రావాలంటేనే మధ్యతరగతి కుటుంబం బెంబేలెత్తిపోతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.


