News November 20, 2025
వజ్రోత్సవం వేళ.. JNTUపై వరాలు కురిపించేనా?

జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించేంచనున్నారు. 21న వజ్రోత్సవం, 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగనుంది. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం కళాశాలకు ఏమైనా వరాలు ప్రకటిస్తారా? అని అధ్యాపకులు, విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎం రాకతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
HYDలో ఇక ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్!

సిటీలో ప్రాపర్టీ వెరిఫికేషన్ ఇకపై డిజిటల్ మయం కానుంది. పన్ను వసూళ్లలో పారదర్శకత కోసం బల్దియా సరికొత్త ‘సెంట్రలైజ్డ్ జియోస్పేషియల్ ప్లాట్ఫామ్’ను సిద్ధం చేసింది. ఫీల్డ్ స్టాఫ్ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేయగానే ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ 3ఏళ్ల ప్రాజెక్టు కోసం 70:30 రేషియోలో టెక్నికల్ బిడ్డింగ్ నిర్వహించాలని GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. దీంతో పన్నుల ఆడిటింగ్ సులభతరం కానుంది.
News January 23, 2026
HYD: టీచర్పై లైంగిక దాడికి యత్నం

టీచర్ ఉద్యోగం కోసం పిలిచి లైంగిక దాడికి యత్నించిన స్కూల్ కరస్పాండెంట్పై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫతేనగర్లోని ఓ పాఠశాలలో ఉద్యోగం కోసం ఓ టీచర్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూ చేసిన సదరు కరస్పాండెంట్ జాబ్ ఇచ్చాడు. ఆమెతో చనువుగా మాట్లాడుతూ లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయంపై PSలో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News January 23, 2026
HYD: CNG కావాలంటే క్యూ కట్టాల్సిందే!

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.


