News December 2, 2025
వనపర్తి: ఒకే ఇంట్లో వెనువెంట విషాదం.. ఆగని రోదన

వనపర్తి మండలం పెద్దగూడెంలో ఒకే ఇంట వెనువెంట విషాదం చోటుచేసుకుంది. ఆగని కన్నీరు రోదన గ్రామస్తుల గుండెను కలచివేసింది. గ్రామానికి చెందిన మిన్నయ్య ఈనెల 18న మరణించారు. అతని దశదినకర్మ ఆదివారం ముగిసింది. కొందరు బంధువులు వెళ్లిపోగా ఇంకొందరు సోమవారం ఊళ్లకు పయనమవుతుండగా అకస్మాత్తుగా మిన్నయ్య కొడుకు చాకలి శీను (45) మరణించారు. వెనువెంటవిషాదంతో ఆ ఇంట కంటతడి ఆగలేదని గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News February 17, 2026
జగిత్యాల MLAపై ముప్పేటదాడి.. అయినా ధైర్యంగా ముందుకు..!

JGTL MLA సంజయ్పై వివిధ పార్టీల నేతలు రోజూ ముప్పేటదాడికి దిగారు. అయినా చలించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీ మారావంటూ, ఎందులో ఉన్నావో చెప్పాలంటూ BRS ఎద్దేవ చేసినా, ఆ పార్టీ MLAలు మా సంసారంలో వేలెందుకు పెడతావన్నా, కాంగ్రెస్ నేతలు అవమానించినా వేరవలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్ల తరఫున MLA ప్రచారం చేసి తన వర్గాన్ని గెలిపించుకొని మున్సిపల్ ఛైర్మన్ చేసి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు.
News February 17, 2026
నేటితో శుక్ర మౌఢ్యమి ముగింపు

గతేడాది నవంబర్ 26వ తేదీన మొదలైన శుక్ర మౌఢ్యమి నేటితో ముగియనుంది. ఇన్నాళ్లూ అస్తమయ స్థితిలో ఉన్న శుక్రుడు రేపటి నుంచి తిరిగి శుభప్రదమైన స్థితిలోకి వస్తాడు. దీంతో నిలిచిపోయిన శుభ కార్యాలు రేపటి నుంచి మళ్లీ మొదలవుతాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి విలువైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, నిశ్చింతగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
News February 17, 2026
JGTL: పొమ్మనలేకే పొగనా..? పార్టీ మారుతారా..?

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్కే పార్టీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.


