News February 11, 2025
వనపర్తి జిల్లాలో68, 587 మందికి రైతు భరోసా నిధులు

వనపర్తి జిల్లాలో రెండు ఎకరాల భూమి వరకు ఉన్న రైతులకు వారి బ్యాంకుల ఖాతాల్లో రైతు భరోసానిధులు సోమవారం ప్రభుత్వం నిధులు జమ చేసింది. వనపర్తి జిల్లాలో 68,587 మంది రైతులకు రూ. 34 కోట్ల 40 లక్షల 23 వేల 950లు జమ అయినట్లు విడుదల చేసిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు ఖాతాల్లో పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతగా ఎకరం వరకు ఉన్న రైతులకు ఇదివరకే రైతు భరోసానిధులు జమ చేశారు.
Similar News
News February 18, 2026
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం కలెక్టర్ చొరవ!

ఖమ్మం (D)లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ అనుదీప్ రంగంలోకి దిగారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి రైతులతో సమావేశమై భూసేకరణపై చర్చించారు. నిబంధనల మేరకు గరిష్ఠ పరిహారంతో పాటు పంటలు, నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News February 18, 2026
ప్రముఖ బాలీవుడ్ నటి మృతి

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రవీణా దేశ్పాండే(60) కన్నుమూశారు. క్యాన్సర్తో చాలా కాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రవీణ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. హిందీ, మరాఠీ సినిమాలతోపాటు టీవీ, వెబ్ సిరీసుల్లోనూ ఆమె నటించారు. సల్మాన్తో రెడీ మూవీతోపాటు ఏక్ విలన్, పరమాణు తదితర ఎన్నో మూవీల్లో కనిపించారు.
News February 18, 2026
కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

కరీంనగర్ జిల్లా ఊటూర్లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


