News August 30, 2024

వరంగల్: అపరిష్కృతంగా 82 వేల పైచిలుకు దరఖాస్తులు!

image

అనుమతి లేని స్థలాల క్రమబద్ధీకరణకు అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్ ల్యాండ్ సీలింగ్) నిబంధనలు, WGL నూతన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) జోన్లు, ధరణి పోర్టల్ అనుసంధానంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. HNK, WGL ప్రాంతాల్లో 82 వేల పైచిలుకు దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. అపరిష్కృతంగా ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ కోసం వేలాదిమంది బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Similar News

News February 11, 2025

వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్‌లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.

News February 11, 2025

నేడు హనుమకొండకు రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హనుమకొండకు రానున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకొని ఆ తర్వాత HNKలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. దీంతో పార్టీ శ్రేణులు భారీగా హనుమకొండకు చేరుకుంటున్నాయి. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

News February 11, 2025

WGL: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హనుమకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!