News April 1, 2024
వరంగల్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. తమ్మిశెట్టి తిరుపతి(22) ఆటో నడుపుకుంటూ దేశాయిపేట ఎన్పీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి.. అతడి చూసి స్థానికుల సాయంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 11, 2026
వరంగల్ జిల్లాలో 85.42శాతం పోలింగ్

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్ధన్నపేట, నర్సంపేట పట్టణాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.42శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో 51,494 ఓట్లకు గాను 43,985 మంది ఓటు వేశారు. ఇందులో వర్ధన్నపేటలో 86.23శాతం, నర్సంపేటలో 85.21శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా జిల్లాలో 84.93శాతం పురుషులు, 85.87శాతం మహిళలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News February 11, 2026
వరంగల్: ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఈ పరీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున జిల్లా వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
News February 11, 2026
WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.


