News September 13, 2025

వరంగల్: ట్రాఫిక్ నియమాలు పాటించండి!

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఫ్రీ లెఫ్ట్‌ మార్గాన్ని వాహనదారులు ఆక్రమించొద్దని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిగ్నల్‌ వద్ద ఎడమవైపు తిరిగే వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మార్గాన్ని ఆక్రమించడం వల్ల ఇతర వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. నిబంధనలను పాటించకపోతే రద్దీ పెరిగి ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News December 10, 2025

ఈనెల 31 వరకే వీటికి గడువు

image

2025 ఎండింగ్‌కి వస్తుండటంతో పలు ఆర్థిక సంబంధిత గడువులు దగ్గరపడుతున్నాయి. ఈనెల 31లోపు పూర్తి చేయకపోతే జరిమానాలు, సేవల నిలిపివేత వంటి ఇబ్బందులుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
1. ముందస్తు పన్ను 3వ విడత చివరి తేదీ ఈనెల 15
2. బిలేటెడ్ ITR దాఖలకు 31 చివరి తేదీ
3. పాన్-ఆధార్ లింక్ డిసెంబర్ 31లోపు తప్పనిసరి
4. PM ఆవాస్ యోజన దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31
5. రేషన్ కార్డు e-KYC

News December 10, 2025

WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్‌గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.

News December 10, 2025

తూగో: కోళ్ల ఓనర్స్ గుండెల్లో గూడ్స్ రైళ్లే..!

image

సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ కోళ్ల ఫోటోలు పెట్టి అడ్వాన్సుల పేరుతో మోసగిస్తున్నారు.