News May 24, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.17,200 పలికింది. అలాగే ఏసీ తేజ మిర్చి రూ.19,000 ధర, 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు భారీగా తగ్గాయి. దీంతో రైతన్నలు కొంత నిరాశ చెందుతున్నారు.

Similar News

News February 18, 2025

నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ: బల్దియా కమిషనర్

image

భవన నిర్మాణ నిబంధనలు పాటిస్తేనే అనుమతులు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే స్పష్టం చేశారు. నూతన భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరు బడా భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీని సర్టిఫికెట్ల జారీకి కమిషనర్ నగర పరిధిలోని సుబేదారి ప్రాంతంలోని పోస్టల్ కాలనీ ప్రకాశ్ రెడ్డి పేట ప్రాంతంలో గల లోటస్ కాలనీ ఖాజీపేట ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు.

News February 18, 2025

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని WGL కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగే ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలెక్టర్ కలసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News February 17, 2025

స్కూలు విద్యార్థులకు కంటి పరీక్షలు: డీఎంహెచ్వో 

image

వరంగల్ జిల్లాలో 36,368 మంది విద్యార్థులు ఉండగా అందులో 33,516 మందికి కంటి పరీక్షలు 92.36% నిర్వహించినట్లు డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. అందులో నుంచి 1074 మంది కంటి దృష్టి లోపాలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించామన్నారు. వారికి నేత్ర వైద్యులతో పరీక్షలు చేస్తూ ఆన్‌లైన్లో స్టేట్‌కి పంపించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమము నేటి నుంచి మార్చ్ 3 వరకు పూర్తి చేయాలన్నారు.

error: Content is protected !!