News May 24, 2024

వరంగల్: స్ట్రాంగ్ రూమ్ భద్రతను ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్ సీపీ

image

ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎనుమాముల మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల కు ఏర్పాటు చేసిన మూడు అంచెల భద్రతను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న విధులపై సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు స్ట్రాంగ్ రూమ్‌లు మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు సూచించారు

Similar News

News March 12, 2026

వరంగల్: ప్రజా పాలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన: కలెక్టర్

image

ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శాఖల వారీగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించాలని స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత పెంచడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 11, 2026

WGL: ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ ఆలస్యం..!

image

WGL నగరంతో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ అంశం వివాదంగా మారింది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా వాటిలో 40కిపైగా లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు DMHO కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ అనుమతి అవసరం కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని, తద్వారా CMRF, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు.

News March 9, 2026

పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

image

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.