News November 19, 2025

వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.

Similar News

News January 16, 2026

ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

image

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.

News January 16, 2026

BREAKING: ఫ్లిప్‌కార్ట్‌, మీషో, అమెజాన్‌కు షాక్

image

చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మెటా వంటి ఈకామర్స్ సంస్థలపై CCPA కఠిన చర్యలు తీసుకుంది. ఒక్కో సంస్థకు ₹10 లక్షల చొప్పున జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ దాటిన వైర్‌లెస్ పరికరాలకు లైసెన్స్, ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ (ETA) తప్పనిసరి. ముందస్తు అనుమతులు లేదా లైసెన్సింగ్ సమాచారం లేకుండానే వీటిని విక్రయించినట్లు తేలింది.

News January 16, 2026

పాపవినాశనం రోడ్డుపై భారీగా వాహనాలు

image

తిరుమలలో పార్వేట ఉత్సవం ఇవాళ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాపవినాశనం తీర్థానికి వెళ్లేందుకు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అనుమతించ లేదు. గోగర్భం సమీపంలోని గేటు వద్ద సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. ఆక్టోపస్ భవనం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉత్సవాల కారణంగా వాహనాల అనుమతి కుదరదని విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలియజేశారు. పాపనాశనం, ఆకాశంగంగకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు..