News November 19, 2025

వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.

Similar News

News January 13, 2026

ములుగు: ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం సందేశం

image

జిల్లాలోని ఉచిత ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం పంపించిన నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షల సందేశం లేఖను విద్యుత్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేస్తున్నారు. ములుగు జిల్లాలో 40,585 గృహ, 25,427 వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని వారందరికీ ప్రభుత్వ సందేశాన్ని చేరవేస్తున్నామని ఎస్ఈ ఆనందం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్ రావు, అధికారులు పాల్గొన్నారు.

News January 13, 2026

పరకాల: బీజేపీలో బహిర్గతమైన అంతర్గత విభేదాలు!

image

సోమవారం పరకాల పట్టణంలో జరిగిన బీజేపీ మున్సిపల్ సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతుండగానే బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, బూతులు తిట్టుకోవడంతో సమావేశం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. పరకాల పట్టణానికి చెందిన ఓ నాయకుడి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్న వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. పార్టీ శ్రేణులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.

News January 12, 2026

ములుగు: యంగ్ ఇండియా స్కూల్స్, మున్సిపల్ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు నుంచి జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. నిర్మాణాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.