News May 7, 2025
వికారాబాద్: ఈనెల 28న ప్రజావాణి రద్దు

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో భూ భారతి రైతు అవగాహనా కార్యక్రమాలు ఉండటంతో ఈనెల 28న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేశామని, ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవ్వరు ప్రజావాణికి రావొద్దని కలెక్టర్ కోరారు. తదుపరి మే నెల 5 నుంచి తిరిగి ప్రజావాణి కొనసాగుతుందని సూచించారు.
Similar News
News February 10, 2026
BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.bobcaps.in
News February 10, 2026
కామారెడ్డి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలి రాజీనామా

కామారెడ్డి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనిత మహేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు కౌన్సిలర్ టికెట్ల కేటాయింపులో తమకు సమాచారం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. పార్టీలో గుర్తింపు లేనప్పుడు పదవిలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా లేఖను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. ఈ రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
News February 10, 2026
ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

T20 ప్రపంచకప్లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.


