News March 29, 2025

వికారాబాద్: ‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 37డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ తలిగే అవకాశం ఉందని, మ.12 నుంచి మ.3.30 వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు తెలిపారు. మ.12 వరకే 35డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. బయటికి వెళ్లేవారు నీరు, గొడుగును తీసుకువెళ్లాలని, సాయంత్రం ఉదయం వేళలో బయటికి వెళ్లాలని సూచించారు. 

Similar News

News April 24, 2025

గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ విజేతగా కోనేరు హంపి

image

పుణె వేదికగా జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచారు. ఫైనల్ రౌండులో బల్గేరియాకు చెందిన నుర్గుయిల్‌పై 1-0 తేడాతో విజయం సాధించారు. తుదిపోరు ముగిసే సమయానికి జు జినర్(చైనా)తో కలిసి ఆమె టాప్‌లో ఉన్నారు. అయితే టై బ్రేక్ ఆధారంగా హంపిని విజేతగా నిర్ధారించారు. మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక తన గేమ్‌ను డ్రాగా ముగించారు.

News April 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 24, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి

image

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ జి.ఫనింద్రరెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి PACS, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వసతులపై ఆరా తీశారు. తక్షణ ట్యాబు ఎంట్రీ, 72 గంటల్లో చెల్లింపు, తేమ శాతం, FAQ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!