News September 12, 2025
విజయదశమి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

విజయదశమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గొడవలకు తావులేకుండా పండుగ జరపడంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
Similar News
News December 6, 2025
జగిత్యాల: ‘పత్రాలు లేకుండా నగదు తరలిస్తే సీజ్’

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రాయపట్నం చెక్పోస్ట్, కిషన్రావుపేట పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్రమ నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై కఠిన నిఘా కొనసాగుతోందని, పత్రాలు లేకుండా భారీ మొత్తంలో నగదు తీసుకెళితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సూచించారు.
News December 6, 2025
ఇండిగో CEOపై చర్యలు, భారీ ఫైన్?

విమాన కార్యకలాపాల నిర్వహణలో ఫెయిలైన ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ను సస్పెండ్ చేసే ఆలోచనలో విమానయాన శాఖ ఉందని తెలుస్తోంది. వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన సంస్థకు భారీ జరిమానా విధించడంతోపాటు ఇండిగో సర్వీసులను తగ్గించాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. FDTL అమలులో నిర్లక్ష్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని కేంద్రం భావిస్తోంది. కాగా, ఆ రూల్ను తాత్కాలికంగా నిలిపివేసింది.
News December 6, 2025
జగిత్యాల: ‘ప్రజా భద్రతలో హోం గార్డులది కీలక పాత్ర’

జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్లో ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, ఎన్నికలు, నైట్ పెట్రోలింగ్, నేర నిరోధం, విపత్తు నిర్వహణలో హోం గార్డుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కళాబృందం అవగాహన కార్యక్రమాలను అభినందించారు. హోం గార్డుల సంక్షేమం కోసం భత్యాల పెంపు, బీమా, రెయిన్ కోట్లు, జాకెట్లు పంపిణీ చేశారు. ఉత్తమ సిబ్బందికి బహుమతులు అందజేశారు.


