News March 26, 2024

విజయనగరం ఎంపీ సీటు.. ఐవీఆర్ఎస్‌లో ఆ ముగ్గురి పేర్లు..!

image

విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం TDP ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో మూడు పేర్లను తెరపైకి తీసుకువచ్చారు. సర్వేలో కలిశెట్టి అప్పలనాయుడు, కంది చంద్రశేఖర్, మీసాల గీత అభ్యర్థిత్వాలపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. కాగా.. మీసాల గీత విజయనగరం ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడగా.. కలిశెట్టి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు.

Similar News

News February 12, 2026

VZM: తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు

image

శివ‌రాత్రికి రామ‌తీర్థం, పుణ్య‌గిరి, ధ‌ర్మ‌వ‌రం, సంగ‌మేశ్వ‌ర స్వామి ఆల‌యం, పాల్తేరు, కోటిప‌ల్లి, త‌దిత‌ర శివాల‌యాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఉచిత‌ బ‌స్సు ప‌థ‌కం వ‌ల్ల‌ మ‌హిళ‌లు గ‌తం కంటే ఎక్కువగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ప్ర‌వేట్ ఆల‌యాలకు సంబంధించి ఆల‌య క‌మిటీల‌ను అప్ర‌మ‌త్తం చేయాలన్నారు.

News February 12, 2026

VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

image

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.

News February 12, 2026

బాడంగి: ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

image

బాడంగి మండలం రావివలస గ్రామానికి చెందిన అప్పలస్వామి (70) మంగళవారం ఉత్తరవల్లిలో బంధువులు ఇంటికి వెళ్లాడు. అప్పలస్వామి వెళ్లి రోజు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు ఆచూకీ కోసం వెతకగా ఊరు సమీప చెరువులో మృతదేహం కనిపించింది. చెరువులో ఉన్న డెడ్ బాడీ తన తండ్రిదేనని కుమారుడు గుర్తించాడు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసుకు బుధవారం ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీ ప్రసాదరావు కేసు నమోదు చేశారు.