News September 11, 2025

విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్ రెడ్డి

image

రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టర్‌ డా.బీఆర్.అంబేడ్కర్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కమిషనర్, రిహాబిలేషన్ & రీసెటిల్‌మెంట్ అండ్ కమిషనర్ (సీఏడీఏ) నుంచి బదిలీపై వస్తున్నారు.

Similar News

News December 13, 2025

ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

image

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.

News December 13, 2025

కొంతమంది సీడీపీవోలు డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నారు: అశోక్

image

ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక DRDA మీటింగ్ హాలులో జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హాజరయ్యారు. కొంతమంది సీడీపీవోలు సొంత వాహనాలను ఉపయోగించి బిల్లులు డ్రా చేసుకుంటూ డ్రైవర్ల ఉపాధిపై దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.

News December 13, 2025

VZM: గుండె ఆగింది… కానీ చూపు కొనసాగింది

image

కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం అంత శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. రెడ్‌క్రాస్, మానవీయత స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్నియా సేకరించారు.