News April 21, 2024
విజయనగరం జిల్లాలో చంద్రబాబు సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం బొండపల్లి మండలంలో మహిళా ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సభకు బొండపల్లి జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ప్రభాకర్, ఎస్.ఐలు లక్ష్మణరావు, మహేశ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
Similar News
News December 16, 2025
బొబ్బిలి: మార్మాంగం కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడు

బొబ్బిలి పట్టణంలోని మతిస్థిమితం లేని యువకుడు మార్మాంగం కోసేసుకున్నాడు. విశాఖపట్నం రెల్లి వీధి ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు సోమవారం బొబ్బిలిలో రక్తంతో రోడ్లుపై తిరుగుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్సకు యువకుడు సహకరించకపోవడంతో వైద్యులు బలవంతంగా వైద్యం చేసి విజయనగరం రిఫర్ చేయగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం KGHకి తరలించారు.
News December 16, 2025
VZM: ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్లైన్లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.
News December 16, 2025
సంక్రాంతికి విజయనగరంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విజయనగరం ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో జీ.వరలక్ష్మి తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి జనవరి 8-14వ తేదీ వరకు ప్రతీ రోజు విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖకి ప్రత్యేక బస్సులు నడుపుటకు వెల్లడించారు. ఈ బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేవని.. సాధారణ ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి చెప్పారు.


