News November 19, 2025
విజయవాడలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్: మంత్రి

విజయవాడలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కబేలా సెంటర్లో రూ.80 లక్షలతో శాశ్వత ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు.
Similar News
News January 22, 2026
బీజేపీ ఎస్సీ మోర్చా ‘గోదావరి జోన్ ఇన్ఛార్జ్’గా సుమన్ బాబు

రాష్ట్ర ఎస్సీ మోర్చా గోదావరి జోన్-2 ఇన్ఛార్జ్గా దేవరపల్లికి చెందిన దున్న సుమన్ బాబు నియమితులయ్యారు. ఈమేరకు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ నియమాక ఉత్తర్వులు జారీచేసారు. సుమన్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, తూ.గో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పణతల సురేష్లకు కృతజ్ఞతలు తెలిపారు.
News January 22, 2026
28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నెల 31న మెగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్(GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) ఖాళీలను భర్తీ చేయనుంది. AP, TGలో దాదాపు 2వేల జాబ్స్ ఉండే అవకాశం ఉంది. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100.
వెబ్సైట్: <
News January 22, 2026
విటమిన్ B12 లోపాన్ని నిర్లక్ష్యం చేయకండి

రోజంతా అలసట, మూడ్ స్వింగ్స్, మర్చిపోవడం వంటివి సాధారణ సమస్యలే అనుకుంటున్నారా? కానీ ఇవి విటమిన్ B12 లోపానికి హెచ్చరికలు కావచ్చు. భారత్లో 15 శాతం కంటే ఎక్కువ మందికి ఈ లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. B12 తక్కువైతే అలసట, నరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, నోటిలో పుండ్లు, దృష్టి సమస్యలు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాహారం, చేపలు, గుడ్లు, పాలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.


