News August 22, 2025

విజయవాడలో ప్రశాంతంగా యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు

image

విజయవాడలోని లబ్బీపేట రెడ్ సర్కిల్‌లో ఉన్న బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్షా కేంద్రంలో యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీశా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి రోజు పరీక్షకు మొత్తం 106 మంది అభ్యర్థులకు గాను, 102 మంది హాజరైనట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News January 12, 2026

ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్‌ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్‌రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.

News January 12, 2026

కనీసం 7 గంటలు నిద్రపోవట్లేదా.. మీ ఆయుష్షు తగ్గినట్లే!

image

నిద్ర సరిగా లేకపోతే సాధారణ అనారోగ్య సమస్యలే కాకుండా ఏకంగా ఆయుష్షే తగ్గిపోతుందని Oregon Health Science University స్టడీలో తేలింది. ఆయుర్దాయంపై ప్రభావం చూపే జీవనశైలి అలవాట్లను పరిశీలించగా.. స్మోకింగ్ తర్వాత నిద్రే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారి ఆయుష్షు తగ్గుతున్నట్లు గమనించారు. డైట్, వ్యాయామం కంటే కూడా నిద్రే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు.

News January 12, 2026

HZB: అలిశెట్టి ప్రభాకర్‌ ‘యాది’లో..

image

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్‌ జయంతి, వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జనసాహితి సభ్యుడు విప్లవ్‌ దత్‌ శుక్లా 1991లో జరిగిన ఓ నాటి సమావేశ అరుదైన చిత్రపటాన్ని పంచుకున్నారు. అప్పట్లో జనసాహితి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్తు హాలులో నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ జయంతి సభకు అలిశెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.