News September 13, 2025
విజయవాడలో స్క్వాష్, బాక్సింగ్ జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాల బాలికల బాక్సింగ్, స్క్వాష్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొనే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో ఉదయం 9 గంటల కల్లా హాజరు కావాలని ఎస్టీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు.
Similar News
News December 17, 2025
గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.
News December 17, 2025
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News December 17, 2025
నరసరావుపేట TDP పార్లమెంటరీ అధ్యక్షుడిగా కోమ్మాలపాటి.!

నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కోమ్మాలపాటి శ్రీధర్ నియామకం దాదాపు పూర్తి అయింది. శ్రీధర్ 2024 నుంచి ఇప్పటి వరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పని చేస్తున్నారు. టీడీపీ అధిష్ఠానం మల్లీ ఆయనవైపే మొగ్గు చూపిస్తోంది. 2009, 2014లో ఆయన రెండు సార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో అక్కడ భాష్యం ప్రవీణ్కు అవకాశం కల్పించారు.


